ఈనెల 29న గుడివాడకు చంద్రబాబు..టీడీపీలో వర్గ పోరు !

-

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 29న అంటే ఎల్లుండే గుడివాడలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే మినీ మహానాడు లో టిడిపి అధినేత పాల్గొంటారు. ఈ క్రమంలో చంద్రబాబు బహిరంగ సభ స్థలాలను మా జీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి నేతలు నిన్న ఉదయం పరిశీలించారు. గుడ్లవల్లేరు, గుడివాడ మండలా ల్లో నాలుగు ప్రాంతాలను రవీంద్ర పరిశీలించారు.

అయితే.. చంద్రబాబు గుడివాడ పర్యటన.. అక్కడి టీడీపీ నాయకుల్లో చిచ్చు రేపింది. చంద్రబాబు టూర్ ముందు గుడివాడ టీడీపీలో గ్రూపుల గోల మొదలైంది. ఇప్పటికే ఫ్లెక్సీల విషయంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్న రావి, శిష్ట్లా లోహిత్…. లోహిత్ ఫ్లెక్సీలను తొలగించి తమ ఫ్లెక్సీలను పెట్టింది రావి వర్గం. ఈ ఎపిసోడులోకి తాజా గా పిన్నమనేని వర్గం ఎంటరవుతోంది. వర్గపోరు లేకుండా కలిసి పని చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం చెప్పినా గుడివాడ టీడీపీలో రచ్చ తగ్గలేదు.

Read more RELATED
Recommended to you

Latest news