ఆ సర్వే ఫలితాలతో చంద్రబాబు డిప్రెషన్ లోకి వెళ్లారు – మంత్రి కాకాణి

-

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చి చెప్పడంతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆదివారం నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తు ఏంటనేది చంద్రబాబుకు అర్థం కావట్లేదని అన్నారు. ఇక నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు పై ఉన్న కోపాన్ని వైసీపీ నాయకులపై చూపిస్తున్నాడని వ్యాఖ్యానించారు.

తాతని వెన్నుపోటు పొడిచినట్టే తనకు వెన్నుపోటు పొడుస్తాడేమోనని లోకేష్ భావిస్తున్నాడని అన్నారు. లోకేష్ ని చంద్రబాబు చెవిలో జోరీగగా భావిస్తున్నారని.. అందుకే ఆయనకు సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటించారని చెప్పారు. ఎవరో రాసిచ్చిన పాయింట్లు మాత్రమే లోకేష్ అవగాహన లేకుండా చదువుతున్నాడని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news