అసెంబ్లీలో పవన్ తో సహా అందర్నీ నిలబెట్టిన చంద్రబాబు..!

-

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది. నా మీద చిన్నప్పుటి నుంచి ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారు. ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ప్రస్తుత హోం మంత్రి అనిత మీద, కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ తరుణంలోనే అసెంబ్లీలో వింత ఘటన చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వం లో కేసులు పెట్టిన వాళ్ళు అందరూ నిలబడాలి అన్నారు సీఎం చంద్రబాబు. కేసులు పెట్టిన వాళ్ళను భారీ majority తో ప్రజలు గెలిపించారు అని పేర్కొన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news