ఏపీలోని 5 కోట్ల మంది పైన కేసులు పెట్టండి – చంద్రబాబు

-

ఏపీలోని 5 కోట్ల మంది పైన కేసులు పెట్టండని ట్వీట్‌ చేశారు చంద్రబాబు. పాలనను ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలనుకుంటే.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది పైనా ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని వైసీపీకి చురకలు అంటించారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతుందని.. కాలర్ ఎగరేసుకుని తిరుగుతోన్న ఎమ్మెల్యేలను జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.

సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుందని.. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెన పై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్ పై కేసు పెట్టి అరెస్టు చెయ్యడం ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు.

విద్యార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా..? వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసీపీ క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే అందరినీ విడుదల చేయాలని.. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news