151 MLA, 22MP లు దాటుతున్నాం : CM జగన్

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళిన జగన్ అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…. 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని అన్నారు.

cm jagan confidance over victory

ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైస్ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version