BREAKING : రైతుల ఖాతాల్లో రూ.175.61 కోట్లు జమ చేసిన సిఎం జగన్

-

ఏపీ రైతులకు జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. కాసేపటి క్రితమే రైతుల ఖాతాల్లోకి రూ.175 కోట్ల సబ్సిడీ జమ చేస్తున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి జమచేశారు.

cm jagan
cm jagan

ఈ నేపథ్యంలోనే రైతులకు‌ పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు ఏపీ సీఎం జగన్. దీనికి సంభందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. .టిడిపి అధినేత చంద్రబాబు హయాంలో ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అగ్రహించారు. ఇప్పుడు రైతులు ఏ ట్రాక్టర్ కావాలో వారే నిర్ణయించుకుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news