సీఎం జగన్ పెద్ద మనసు..అనారోగ్యంతో ఉన్న రైతు, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం

-

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల సీఎం జగన్ ఔదార్యం చూపించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రైతు, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం చేశారు సీఎం జగన్‌. అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందులకు చెందిన ఇద్దరు చిన్నారులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన ఓ రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కలిసి విఙప్తి చేసింది రైతు భార్య శివజ్యోతి. దీంతో వివరాలు తెలుసుకుని వెంటనే రూ.2 లక్షలు మీ అకౌంట్ లోకి వేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news