సీఎం జ‌గ‌న్ ఎన్టీఆర్ జిల్లా పర్యటన..గో బ్యాక్ అంటూ పోస్టులు

-

ఇవాళ సీఎం జ‌గ‌న్ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో అర్థ‌రాత్రి పోలీసుల హైడ్రామా సృష్టించారు. సీఎం జ‌గ‌న్ తిరువూరు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య‌ని అర్థ‌రాత్రి అక్ర‌మంగా అరెస్ట్ చేశారు పోలీసులు. తిరువూరు కు ఇచ్చిన హామీలు అమలు చేయని గో బ్యాక్ అంటూ సోషల్ మీడియాల్లో మునియ్య పేరుతో పోస్టులు పెట్టారు.

అయితే… సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అడ్డుకుంటార‌న్న అనుమానంతో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మునియ్య అక్ర‌మ అరెస్ట్‌ చేశారు. దీంతో ఆందోళ‌న‌లో దిగారు మునియ్య కుటుంబ స‌భ్యులు, కార్య‌క‌ర్త‌లు. మునియ్య ద‌గ్గ‌ర ఫోన్లు లాక్కున్న పోలీసులు, అతన్ని ఎక్క‌డికీ తీసుకెళ్తున్నారో చెప్ప‌లేదు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై సీఎం ప‌ర్య‌ట‌న‌లో వాసం మునియ్య‌..నిర‌స‌న తెల‌పాల‌ని చూశారు. ఏ.కొండూరు కిడ్నీ బాధితుల క‌ష్టాలు, చింత‌ల‌పూడి లిఫ్ట్ ఇరిగేష‌న్ పూర్తి చేయ‌క‌పోవ‌డం, విన‌గ‌డ‌ప వ‌ద్ద క‌ట్టేల‌రు వంతెన నిర్మాణం లాంటి వాటిపై సీఎం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు వాసం మునియ్య‌.

Read more RELATED
Recommended to you

Latest news