సీఎం జగన్ రూ. 43 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు – సోమిరెడ్డి

-

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పొదలకూరులో దళితుడు నారాయణ మృతి కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించిందని.. నారాయణ మరణం సహజమైనది కాదని జాతీయ ఎస్సీ కమిషన్ కూడా నిర్ధారించిందన్నారు. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని మండిపడ్డారు.

సర్వేపల్లి లో మంత్రి కాకాణి, నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ల పాపాల చిట్టాను డాక్యుమెంట్లతో సహా లోకేష్ బయట పెట్టారని తెలిపారు. ప్రమాణాలు చేసిన వారే అవినీతి పాల్పడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి దమ్ముంటే సిబిఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు. టిడిపి హాయంలో లక్షల కోట్ల అవినీతి అన్నారని.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. జగన్ రూ.43 వేల కోట్ల మేర అక్రమాలు పాల్పడ్డారని సిబిఐ తెలిపిందన్నారు సోమిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news