నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

-

నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యాదీవెన పథకం లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు సీఎం జగన్. అనంతరం సత్యవతినగర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్.

ఇక ఈ టూర్‌ పూర్తి షెడ్యూల్‌ ను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి జగన్ ఉదయం 8.30 కు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడ నుంచి ఉ 8.40 కు బయలుదేరి కొవ్వూరు కు కే జీ ఎం హై స్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉ.9.20 కు చేరుకుంటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులను కలుస్తారు.

ఇక్కడ నుంచి ఉ.9 30 కు బయలుదేరి రోడ్ షో గా సత్యవతి నగర్ లోని బహిరంగ సభ .. సభావేదిక కు ఉ.9.40 కు చేరుకుంటారు. ఉ.9.45 నుంచి ఉ.11.15 కు సభాస్థలి కార్యక్రమంలో ఇక్కడ లబ్ధిదారులతో ముఖాముఖి, ప్రముఖుల సందేశాలు, ముఖ్యమంత్రి సందేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉ.11.20 కు సభా వేదిక నుంచి బయలుదేరి ఉ.11.30 కు కొవ్వూరు – హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉ.11.30 నుంచి మ.12.00 వరకు స్థానిక ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం తాడెపల్లికి వెళతారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news