ఈ నెల 3న సీఎం జగన్‌ విశాఖ, విజయనగరం పర్యటన

-

ఈనెల 3న సీఎం జగన్ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వైజాగ్ ఐటీ టెక్ పార్కును శంకుస్థాపన చేస్తారు.

విశాఖపట్నం పర్యటన

ఆ రోజున మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్‌ 4లో గల వేదిక వద్దకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌… వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఫోటో ఎగ్జిబిషన్‌ సందర్శన, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగం ఉంటుంది. ఇక సాయంత్రం నాలుగు గంటలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్‌… ఎంపీ కుమారుడు, దంపతులకు సీఎం జగన్ ఆశీర్వదం ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news