చంద్రబాబు పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

-

తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి  అన్నారు. ప్రకాశం జిల్లా మేదరిమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. లంచాలు, వివక్ష లేని పాలనతో మన ఫ్యాన్‌కి కరెంట్ వస్తుందన్నారు. మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా లేదని ధ్వజమెత్తారు.

2014లో ఇచ్చిన హామీలు టీడీపీ కూటమి అమలు చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట తప్పారని చెప్పారు. మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు పొత్తుల డ్రామాతో అందరి ముందుకు వస్తున్నాడని అన్నారు. చంద్రబాబు పొత్తులతో ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిందని తెలిపారు.

రూ. 2.65 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని అన్నారు. డీబీటీ, నాన్ టీబీటీ ద్వారా రూ. 3.75 లక్షల కోట్లు 58 నెలల కాలంలో ప్రజలకు అందించామని వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఏపీ శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 8 సంక్షేమ పథకాలకు రూ. 75 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. చంద్రబాబు చెబుతున్న పథకాలకు మరో రూ. 87,312 కోట్లు కావాలని వివరించారు. ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వలంటీర్లు వివరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news