BREAKING : నేటి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన రద్దు

-

BREAKING : నేటి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన రద్దు అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేటి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన రద్దు అయింది. అయితే, పర్యటన రద్దు గల కారణాలను ప్రభుత్వం చెప్పడం లేదు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక వేళ ఈ పర్యటన రద్దు కాకుంటే.. ఇవాళ విశాఖలో సీఎం జగన్‌ పర్యటించి ఉండే వారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొని అనంతరం పలు శుభకార్యాలలో పాల్గొనబోయేవారు. అక్కడి నుండి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్ లో జరగనున్న అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీల స్రవంతి వివాహానికి హాజరయ్యే వారు.

Read more RELATED
Recommended to you

Latest news