కూటమిలో గెలిచిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు : తమ్మినేని సీతారాం

-

కూటమిలో గెలిచిన చంద్రబాబునాయుడు కి,పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం ఓడిపోతుందని అస్సలు ఊహించలేదన్నారు. మా ప్రభుత్వంలో ఎంతో ప్రజలకు చేయాలని ఉంది. కానీ ప్రజలు మా ఆలోచనలకు కళ్ళెం వేసారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు. వైసీపీ కార్యకర్తలు మనో ధైర్యంతో ఉండాలి. వైసీపీకి, నాతో పాటు కష్టపడిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక కూటమి ఇచ్చిన ఎన్నికల హమీలను తూచా తప్పక పాటించాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలు ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ఇచ్చిన హమీలు పూర్తి చేయాలని దేవుడిని ప్రార్దిస్తున్నాను. సీఎంగా జగన్ ఉన్నప్పుడు అలాగే చేశారు.. రాబోయే సీఎం కూడా అలాగే చేస్తే.. అందరికీ మేలు జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news