టీడీపీ ఎంపీకి కొత్త మొగుడు.. ఏం ఏకేశాడులే…!

-

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో రెచ్చిపోతున్న నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే.. ఆయ‌న ఖ‌చ్చితంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని. రెండు సార్లు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన ఆయ‌న అటు పార్టీలోనూ ఇటు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనూ పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌రకు కేశినేని చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు ఎవ‌రూ కౌంట‌ర్ ఇచ్చేవారు కారు. దీంతో ఆడింది ఆట‌గా.. పాడింది పాట‌గా నాని రెచ్చిపోయేవారు. ఇటు సొంత పార్టీపైనా అటు అధికార పార్టీపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. విష‌యం ఏదైనా రెచ్చిపోయేవారు.

 

అయితే, ఇప్పుడు నానికి స‌రైన మొగుడు దొరికాడ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కేశినేని నాని.. విజ‌య‌వాడ‌లో నిర్మాణం పూర్త‌యిన దుర్గ‌గుడి ఫ్లై ఓవ‌ర్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఫ్లైవోర్‌ను టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే పూర్తి చేశామ‌ని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రారంభిస్తోంద‌ని.. అన్నారు. అంతేకాదు, ఫ్లైవోవ‌ర్ క్రెడిట్ మొత్తం టీడీపీదేన‌ని చెప్పారు. అయితే, ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా మాట్లాడ‌లేదు. కానీ, ఇప్పుడు వైఎస్సార్ సీపీ యువ నాయ‌కుడు, అదే సామాజిక వ‌ర్గానికి చెందిన దేవినేని అవినాష్‌. కేశినేనికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

దుర్గ గుడి ఫ్లై ఓవర్‌పై కేశినేని నాని మాట్లాడడటం సిగ్గు చేటు అని అవినాష్ నిప్పులు చెరిగారు. అంతేకాదు, అధికారంలో ఉండగా పూర్తి చేయలేకపోయారు.. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండు సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారని ప్రశ్నించారు.

కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తానని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. మొత్తానికి కేశినేని నానికి అవినాష్ ఇచ్చిన కౌంట‌ర్‌పై విజ‌య‌వాడ రాజ‌కీయ నేత‌లు ఆస‌క్తిగా చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామంతో కేశినేనికి స‌రైన మొగుడు దొరికాడంటూ కొంద‌రు కామెంట్లు సైతం చేస్తున్నారు. మ‌రి మున్ముందు వీరి రాజ‌కీయం ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news