టీడీపీలో చేరిన ఏలూరు మేయర్..!

-

నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం లో చేరారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్నారు. అలాగే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహహస్తం అందిస్తున్నాం. ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశం లో చేర్చుకుంటున్నాం. త్వరలోనే దశల వారీగా కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరబోతున్నారు అన్నారు.

ఇక ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పార్టీ మారడం పై స్పందిస్తూ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం వీడి వైసీపీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేక పోయాం. దాదాపు 40 మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధoగా ఉన్నారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news