కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలి – మంత్రి జయరాం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వికేంద్రీకరణకి మద్దతుగా కర్నూలు STBC కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రజలు, మేధావులు, విద్యా వేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైయస్ఆర్ సీపీ నేతలు రాయలసీమ గర్జన సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని అన్నారు.

కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలని విన్నవించారు. కర్నూలు పై ప్రేమ సినిమాలలోనే కాదని, రియల్ గా కూడా చూపించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news