వివేకా హత్య కేసులో గౌతమ్‌ సవాంగ్‌ సంచలన ప్రకటన

-

వైఎస్‌ వివేకా హత్య కేసులో రోజు కో ట్విస్ట్‌ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కీలక ప్రకటన చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ఈ హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలని.. దోషులకు శిక్షపడేలా చేయాలని మాత్రమే జగన్‌ తమతో చెప్పేవారని గౌతమ్ సవాంగ్‌ చెప్పారు.

కొన్ని కథనాలు.. అయితే.. ఇటీవల కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని.. కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్నప్పుడు తాను మాట్లాడినట్లు వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తనకు జగన్‌ మోహన్ రెడ్డి ఎప్పుడూ వైఎస్‌ వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డి రెండు కళ్లు లాంటి వారని మాత్రమే చెప్పారని… అదే విషయాన్ని తనను కలిసిన సునీత, రాజశేఖర్‌ రెడ్డికి చెప్పానని పేర్కొన్నారు. తానున ఏనాడూ అవినాష్‌ రెడ్డి, సురేంద్ర, శివశంకర్‌ లను కలవలేదని చెప్పారు మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news