కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

-

ఏపీలోని కోనసీమ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై వ్యాను, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన మరో 9 మందిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవ దర్శనం కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి వస్తున్న కారు ఆలమూరు పరిధిలోని మడికి జాతీయ రహదారి వద్దకు రాగానే.. అదుపుతప్పి వ్యాన్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news