ఒడిశా ప్రమాదం.. 290కి చేరిన మరణాల సంఖ్య

-

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేయిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఓవైపు స్థానిక పోలీసులు.. మరోవైపు కేంద్ర దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది.

అయితే, తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల యువకుడు ఇవాళ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 2న షాలిమార్-చెన్నై కోరమండల్ రైలులో వెళ్తున్న ప్రకాష్… రైలు ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. శరీరంలో పలు అవయవాలు దెబ్బ తినడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య 290కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news