ఏపీలో మరో విషాదం.. శానిటైజర్ తాగి నలుగురు మృతి..!

-

ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన నలుగురు వ్యక్తులు శానిటైజర్ తాగి మృత్యువాత పడ్డ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంరేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కేవెంజెర్ కాలనీకి చెందిన వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులు మద్యం దొరక్కపోవడంతో శుక్రవారం నాడు శానిటైజర్ తాగారు. దీంతో వీరి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది.

వెంటనే రుయా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ నలుగురూ మరణించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో ఈ తరహా ఘటనలు జరిగాయి. మద్యం బదులు శానిటైజర్ తాగి ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో పలువురు మరణించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news