సుశాంత్‌ను కుక్క బెల్టుతో చంపేసారు : మాజీ అసిస్టెంట్

-

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక విషయం వెలుగుచూస్తుంది. ఇప్పటికే ఆయన తండ్రి కృష్ణకుమార్‌ సింగ్‌ పట్నా పోలీసులను ఆశ్రయించారు. సుశాంత్‌ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మాయం చేసిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ కేసు విషయమై శుక్రవారం నాడు రియా చక్రవర్తిని ఈడీ విచారించింది. అయితే సుశాంత్ మృతిపై మాత్రం చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు..

two of sushanth fans roped themselves

తాజాగా.. సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. అది ముమ్మాటికి హత్యేనని బాంబు పేల్చాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఆయన మనస్తత్వం తనకి బాగా తెలుసని అంకిత్ అన్నారు. సుశాంత్ ని ఎవరో కావాలని హత్యచేసి.. దాన్ని ఆత్మహత్యాగా చిత్రీకరించారని, పైగా సుశాంత్‌ను అతని పెంపుడు కుక్క ఫుడ్జ్ బెల్టుతో ఉరివేసి మరీ చంపేశారని ఆయన ఆరోపించాడు. ఏదిఏమైనా దీనికి కారణమైన వారికి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news