ఏప్రిల్ 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు” – సజ్జల

-

ఏప్రిల్ 7వ తేదీ నుండి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ మేరకు “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమ పోస్టర్‌ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కొనసాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 14 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే భావన ప్రజల నుంచే వచ్చిందన్నారు. అందుకే దీనిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేశామని.. ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకుని రావడం కోసం ప్రతి పేద కుటుంబం తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా చేయటం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలు ఉండాలని అన్నారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news