వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లే వారికి శుభవార్త..

-

 

వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లే వారికి శుభవార్త..వేసవి సెలవుల్లో హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లేవారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ‘గోవిందం తిరుపతి’ ప్యాకేజీ పేరుతో దీనిని తాజాగా తిరుమల భక్తుల కోసం ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ రెండు రాత్రులు, రెండు పగళ్ళు ఉంటుంది.

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఉచితంగా ఇవ్వడంతో పాటు పద్మావతి ఆలయ దర్శనం కూడా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే రెండు ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చారు. స్టాండర్డ్ ప్యాకేజీలో డబుల్, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 3,800, సింగిల్ షేరింగ్ కు రూ. 4,950 చెల్లించాలి. ఇక కంఫర్ట్ ప్యాకేజీలో త్రిబుల్, డబుల్ షేరింగ్ కు రూ. 5,600 సింగిల్ షేరింగ్ కు రూ. 6,790 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news