విశాఖలో అదానీ డేటా పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ప్రోత్సాహాకాలు

-

విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ప్రకటించింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు ప్రోత్సాహకాల ప్యాకేజీకి అనుమతి ఇచ్చింది. డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్క్, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం నిర్మాణాలకు విశాఖలోని మధుర వాడలో 130 ఎకరాలని కేటాయించారు. భూమి అప్పగించిన మూడేళ్ల లోపు కార్యకలాపాలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏడేళ్లలోపు నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.

డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్కుకు 20 ఏళ్లపాటు విద్యుత్ ప్రోత్సహకాలు జారీ చేసింది. డేటా సెంటర్ లో విద్యుత్, సమాచార, ఐటీ పరికరాల కోసం 100 శాతం ఎస్ జీఎస్టీని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును కీలకమైన ప్రాజెక్టు గా గుర్తించి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. జాతీయ రహదారి 16కు అనుసంధానం కల్పించేలా ఇతర మౌలిక సదుపాయాలను అదానీ ఎంటర్ ప్రైజెస్ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది. ప్రాజెక్టు కోసం అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఏపీ లో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ ఎంటర్ప్రైజెస్ కి అనుమతి ఇచ్చింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయనున్న ఐటీ బిజినెస్ పార్క్ లో కేవలం ఐటీ, ఐటీ ఈ ఎస్ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.  ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కోసం ఇచ్చిన భూమిలో ఎలాంటి నివాసాలూ ఉండేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news