ఈ నెల 22న బందరు పోర్టు పనులు ప్రారంభం – గుడివాడ అమర్నాథ్

-

ఈ నెల 22న బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక టీడీపీ, వారి మీడియా విషం కక్కుతోందని నిప్పులు చెరిగారు. వారి బాధ చూస్తుంటే జాలి వేస్తోందన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నెల 22న బందరు పోర్టు శంఖుస్థాపన జరుగనుందన్నారు.

లక్షా 30 వేల మందికి సచివాలయాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదని తెలిపారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎమ్ఎస్ఎమ్ఈ సెక్టార్ లో 12 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు గత నాలుగేళ్లల్లో లభించాయని వివరించారు. ఎలక్ట్రానిక్, ఐటీ సెక్టార్ లో చంద్రబాబు హయాంలో వెయ్యి కోట్లు పెట్టుబడులు వస్తే మా నాలుగేళ్ళ కాలంలో ఐదువేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news