తాడేపల్లిగూడెం నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేయాలి – హరిరామ జోగయ్య లేఖ

-

తాడేపల్లిగూడెం నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేయాలని కోరారు హరిరామ జోగయ్య. పశ్చిమ నుంచి పవన్ పోటీ చేయాలంటూ హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు.

నరసాపురం కొణిదల కుటుంబానికి సొంత నియోజకవర్గం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నర్సాపురం, భీమవరం ,తాడేపల్లిగూడెంలో ఏదో ఒక నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటూ ఇక్కడి ప్రజల కోరిక అన్నారు జోగయ్య. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. కాగా, అటు.. తనపై పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్‌ కళ్యాణ్ కు సవాల్‌ విసిరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.

Read more RELATED
Recommended to you

Latest news