తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఫ్యాన్స్‌ కు చిరంజీవి కీలక ఆదేశాలు

-

తెలంగాణ,ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే… తెలంగాణ,ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలోనే.. మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఫ్యాన్స్‌ కు చిరంజీవి కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నారు చిరంజీవి. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు మెగాస్టార్‌ చిరంజీవి.

Heavy rains in Telangana, AP Chiranjeevi’s key instructions to fans

మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు మెగాస్టార్‌ చిరంజీవి. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఙప్తి చేశారు. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారని గుర్తు చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నానని తెలిపారు మెగాస్టార్‌ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news