జూనియర్ ఎన్టీఆర్ నన్ను తిట్టినా, చంపినా ఎదురు మాట్లాడను – కొడాలి నాని

-

ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్రలు చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని.. కానీ ఎన్టీఆర్ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. బాబును నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పని అన్నారు కొడాలి నాని.

ఎన్టీఆర్ కుటుంబం పై తనకు విశ్వాసం ఉందన్నారు. తాను ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ గారికి రుణపడి ఉంటానని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనకి సీటు ఇప్పించారని.. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తనని తిట్టినా.. చంపినా తాను తిరిగి ఒక్క మాట కూడా ఎదిరించి మాట్లాడాలని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాదులో కొండలు తవ్వి ఇల్లు కట్టుకోలేదా? అని ప్రశ్నించారు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని ఆరోపించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news