దేవుడితో పరాచకాలు ఆడితే బాబు పాతాళానికే – డిప్యూటీ సీఎం కొట్టు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమగోదావరిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞం చేసినట్లు స్పష్టం చేశారు. దేవుడితో పరాచకాలు ఆడితే చంద్రబాబు పాతాళానికి పోతారని హెచ్చరించారు.

దగా, మోసం, వెన్నుపోటు, అవినీతి కలిపితే చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏపీ నీ పాతాళానికి తొక్కేశాడని అన్నారు. 2019లో ప్రజలు చీకొట్టినా మళ్లీ మాయమాటలు చెబుతున్నాడని.. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలలో ఉండడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు పాలనలో దుర్భిక్షం, కరువు కాటకాలేనన్నారు. 2004 ఎన్నికలలో చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news