ఏపీ ప్రజలకు అలర్ట్ : జూలై 1 నుంచి ‘జగనన్న సురక్ష’

-

ఏపీ ప్రజలకు అలర్ట్.. జూలై 1 నుంచి ‘జగనన్న సురక్ష’ ప్రారంభం కానుంది. ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అమలుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూలై 1న రాష్ట్రంలోని 1297 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. అర్హులై ఉండి పథకాలు అందని వారికి ‘జగనన్న సురక్ష’ ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు.

మొత్తం 15,000 సచివాలయాల్లో నిర్దేశిత తేదీల్లో క్యాంపులు నిర్వహిస్తారు. వారం ముందే క్యాంపు తేదీలపై మైక్ లో ప్రచారం చేసి లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేయనున్నారు. ఇక అటు నేడు వైఎస్ఆర్ లా నేస్తం ఆర్థిక సాయం విడుదల చేయనుంది జగన మోహన్ రెడ్డి సర్కార్. క్రితం ఏడాది లాగే ఇవాళ వైయస్సార్ లా నేస్తం పథకం కింద ఆర్థిక సాయం విడుదల చేయనుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2677 మంది యువ లాయర్ల ఖాతాలలో నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ విడుదలలో భాగంగా తొలివిడతను సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలలో జమ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news