చంద్రబాబుని బతకనివ్వం.. గొంతు మీద కత్తి పెట్టి అంటూ జేసీ సంచలనం !

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అన్ని విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తాజాగా ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ కంటే రెండింతలు చంద్రబాబు ఎక్కువ చేయాలని అన్నారు. చంద్రబాబు సాత్వికుడని ఆయనకి దుర్మార్గపు ఆలోచనలు లేవని అన్నారు.

అయినా సరే ఆయన సపోర్టర్స్‌ అయిన మేము ఆయన్ని బతకనివ్వమని, ఆయన గొంతు మీద కత్తిపెట్టి అయినా చేస్తావా, చెయ్యవా, నువ్వు చెయ్యకపోతే ఎలా అని ప్రశ్నిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అలానే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగిన వారికీ పార్టీ అండ ఉంటుందని చంద్రబాబు అంటారని అండ లేదు, బండ లేదు.. మాకు ఇబ్బందులు కలగజేసిన వారి పై కేసులు చూపిస్తాం ఏం యాక్షన్ తీసుకుంటావ్.. యాక్షన్ తీసుకోకపోతే నీ నాయకత్వం మాకు ఎందుకు అంటూ ప్రశ్నిస్తానాని ఆయన అన్నారు. చంద్రబాబు అప్పటికీ యాక్షన్ తీసుకోకతే ఇదేదో మూడో రకం అనుకోవాల్సి వస్తుంది అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news