ఆనం పై దాడి ఎవరు చేసారు అనేది పోలీసులు తేలుస్తారు – కాకాణీ

-

ఆనం పై దాడి ఎవరు చేసారు అనేది పోలీసులు తేలుస్తారని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్ధాల ఎగుమతులలో ఏపీ కి అవకాశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ను ప్రారంభించారు వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా రైతుకు లాభం చేకూర్చడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక కార్యక్రమం ఇది.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనం పై దాడి ఎవరు చేసారు అనేది పోలీసులు తేలుస్తారని.. ఈలోపే సజ్జల పేరు, నాఏరు, ఇలా ఎవరికి తోచిన పేరు వాళ్ళు చెపుతున్నారని ఫైర్‌ అయ్యారు. టీడీపీ కామెంట్లు అసలు పట్టించుకోవక్కర్లేదని.. కోర్టులో చోరీ అంశంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. కోర్టులో చోరీ విషయంలో ఏం జరిగిందో త్వరలో తేలుతుంది.. అప్పుడు నేను కోర్టులో చోరీ అంశంపై కామెంట్ చేస్తానంటూ ప్రకటన చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news