ఫోన్ ట్యాపింగ్ జరగలేదు… మ్యాన్ ట్యాపింగ్ జరిగింది – మంత్రి కాకాణీ

-

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు… మ్యాన్ ట్యాపింగ్ జరిగిందన్నారు మంత్రి కాకాణీ. పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతం.. వైసీపీపై బురద జల్లడం కోటంరెడ్డి మానుకోవాలని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసు అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మ్యాన్ ట్యాపింగ్ జరిగింది.. కోటంరెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం జగన్‌ కారణం కాదా?. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు ఏమైంది? అని నిలదీశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. నీపై జగన్‌కు అనుమానం ఉంటే ఎమ్మెల్యేగా ఉండేవాడివా?.. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు.. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news