జగన్ బెస్ట్ పథకాన్ని జగనే ఆపేశారు: లోకేష్!

-

చినబాబు తీరు చూస్తుంటే… ఆ రెండంకెల సంఖ్యను కూడా పార్టీకి మిగిల్చేలా లేరు అనేది తాజాగా తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్న మాట! ఎందుకంటే.. గత కొన్ని రోజులులుగా ప్రెస్ ముందుకు వస్తున్న చినబాబు చేస్తున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్నీ కాదు! ఎదో ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలనె తాపత్రయంలో జనం నవ్వుకునే మాటలు చెబుతూ.. “నేనింతే” అని క్లారిటీ ఇస్తున్నారు!

ఇందులో భాగంగా తాజాగా మైకుల ముందుకొచ్చిన చినబాబు.. “రాష్ట్రవ్యాప్తంగా భూముల పంపిణీ కార్యక్రమం టీడీపీ వల్లే ఆగిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.. అదే నిజమైతే నిరూపించాలి. అసలు నిజం ఏమిటమటే… వైసీపీ భూపంపిణీ కార్యక్రమం వైకాపా నేతల వల్లే ఆగిపోయింది.. వారు కోర్టులకు వెళ్లడం వల్లే నిలిచిపోయింది” అని చెప్పుకొచ్చారు!

అసలు ఆ మాటలకు ఏమైనా అర్ధం పర్థం ఉందా…? తాను అధికారం చేపట్టిన ఏడాది లోపే నవరత్నాల పథకాలను అమలులో పెట్టిన జగన్.. తాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భూపంపిణీ కార్యక్రమాన్ని తానే ఆపేస్తారా? ఆ పథకం విలువ, ఆ పథకం పూర్తయితే జనాల్లో ప్రభుత్వానికి వచ్చే విలువ.. జగన్ కు తెలియందా? నవరత్నాలతో పాటు ఈ పథకం కూడా పూర్తయితే టీడీపీ పరిస్థితి ఏమవుతుందో జగన్ కు తెలియదా?

మరి ఇన్ని తెలిసిన జగన్… ఆ భూపంపిణీ కార్యక్రమాన్ని తానే ఎందుకు ఆపుకుంటారు? పైగా అది చినబాబు నిరూపిస్తానంటున్నారు? ఏమి చినబాబు ఇది… బ్రేకింగ్ న్యూస్ కావాలంటే మరో మార్గం ఉంది కదా? ఇదే ప్రత్యామ్నాయమా? ఆర్కే అంకుల్ ని అడిగితే బోలెడు బ్రేకింగ్ న్యూస్ లు ఇస్తారు కదా? సరే… అయ్యిందేదో అయ్యింది లైట్ తీసుకోండి తమ్ముళ్లు ఈ సారికి!

ఇక్కడ విచిత్రం ఏమిటంటే… ఈ పథకం గొప్పతనం చంద్రబాబుకి బాగా తెలుసు. ఒక్కసారి ఈ పథకం పూర్తిస్థాయిలో అమలయితే.. ఇక జగన్ సర్కార్ కు జనాల్లో మరింత సుస్థిర స్థానం కలగడం తధ్యం! ఈ బెంగతోనే బాబు కోర్టులను నమ్ముకుని కాలాన్ని నెట్టుకొస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఆ విషయం తెలిసిన, మరిచిన చినబాబు ఇలా కామెంట్లు చేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news