లక్ష మందితో ఏపీలో సీఎం కేసీఆర్‌ సభ : మంత్రి మల్లారెడ్డి

-

లక్ష మందితో ఏపీలో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహిస్తామని మంత్రి మల్లారెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు అన్నారు.

త్వరలో ఏపీలో లక్ష మందితో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తామని… దీనికి సంబంధించి అక్కడ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 2024 లో అధికారం బీఆర్ఎస్ దే అని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ – ఏపీలో అభివృద్ధిలో ఎంత తేడా ఉందో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. అటు మహారాష్ట్రలోను బిఆర్ఎస్ అనుకూల వాతావరణం పెరుగుతోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news