మా వైఫల్యాలకు మీడియా కూడా కారణమే – సత్యకుమార్

-

తిరుపతి జిల్లా: వెంకటగిరిలో భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించదగ్గ నేత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా పాలన ఎలా జరుగుతోందో అందరికీ తెలుసన్నారు సత్యకుమార్. సీఎం జగన్ ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ సమానంగా, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు.

రాష్ట్రంలో అధికారం లేకపోయినా 9 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చారని అన్నారు. మా వైఫల్యాలకు మీడియా కూడా కారణమేనన్నారు సత్య కుమార్. ఎవడో చిన్నాన్నను చంపి తప్పించుకు తిరుగుతుంటే.. వాడిదే 4 రోజులుగా చూపిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మేము చేసిన అభివృద్ధి మాత్రం మీడియా ఎక్కడా చూపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news