ఏపీ రైతులకు జగన్ శుభవార్త..రేపు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ

-

రేపు గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చుట్టుగుంటలో వైఎస్సార్ యంత్ర సేవ-2 కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు ఏపీ సీఎం జగన్. ఇక అటు ఇవాళ వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

ఇప్పటికే వరుసగా ఐదో ఏడాది.. ఈ ఏడాదికి మొదటి విడత ఆర్ధిక సాయం చేయనున్నారు. రైతులకు ఏటా 13,500 రూపాయల ఆర్ధిక సహాయం చేయనున్నారు. వరుసగా 4 ఏళ్ళు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం అందించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం… ఈ ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా అందించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 52,30,939 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతుల ఖాతాల్లో 3,923.21 కోట్ల నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news