పోలవరంలో స్టార్‌ హోటల్‌ పెడతాం : మేఘా కృష్ణారెడ్డి

-

పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ కట్టేందుకు మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి ముందుకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ముందు ప్రస్తావించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచో తాము కొండపై స్థలం కోరుతున్నామని, ఇంతవరకు కేటాయించలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్‌ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

మంగళవారం రోజున ఏపీ సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టు సందర్శన క్రమంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణ అంశం చర్చకు వచ్చింది. అయిదు కాకుండా, ఏడు నక్షత్రాల హోటల్‌ నిర్మించాలని సీఎం సూచించినట్లు సమాచారం. భూ కేటాయింపు గురించి అధికారులకు ఆయన కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలిసింది. స్థలం కేటాయిస్తే అటు పోలవరం ప్రాజెక్టుతో పాటు హోటల్‌ నిర్మాణం ఒకేసారి పూర్తి చేస్తామని కూడా కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news