ఆత్మకూరు ఉపఎన్నిక విజయంపై మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమోషనల్.. గౌతమ్ అన్న పేరు నిలబెడతానంటూ..

-

ఆత్మకూరు ఉపఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజారిటీ సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. గెలుపు సాధించిన తర్వాత విక్రమ్ రెడ్డి కొంత ఎమోషనల్ అయ్యారు. తన సోదరుడు గౌతమ్ ను గుర్తు చేసుకున్నారు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను అని ఉద్వేగానికి లోనయ్యారు.

తన పైన మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. తనను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు విక్రమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ లో 205 ఓట్లకు గాను వైఎస్ఆర్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో బ్యాలెట్ ఓట్లలోను వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news