బీసీ మంత్రి పై ఆరోపణలు చేయడం క్షమించరాని నేరం : మంత్రి గుమ్మనూరు

-

మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఈరోజు తన మీద చేసిన ఆరోపణల మీద ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందించారు. అయ్యన్నపాత్రుడు భూకబ్జాదారుడని నా పై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఒక బీసీ మంత్రి పై ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్న ఆయన మా ఆలూరు నియోజకవర్గానికి వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు అంటూ అయ్యన్నకు సవాల్ విసిరారు.

తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి ఒక బీసీ నేతగా 30 ఎకరాలు భూమి కొంటే మీకు ఎందుకు మంటగా ఉంది? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 2 ఎకరాల నుంచి వేల కోట్లు ఎలా సంపాదించారని ఎందుకు అడగలేకపోతున్నారు అని ప్రశ్నించిన ఆయన 2018 లో చంద్రబాబు నాకు మంత్రి పదవి, 50 కోట్లు ఆఫర్ చేశారని అన్నారు. అలానే ఇలాంటి ఆరోపణలు మరోసారి చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి అయ్యన్నకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఇలాంటి ఆరోపణలు చేస్తే బీసీల పవర్ ఏమిటో చూపిస్తానని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news