చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కక్ష పూరితంగా చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లి ప్రాజెక్ట్ నిర్మాణాల పై స్టే తెచ్చారని ఆరోపించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో తాగు, సాగు నీటిని అందించాలని మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని.. ఇప్పటికే రెండు రిజర్వాయర్లు దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఆ నిర్మాణాలు పూర్తయితే, రైతులకు, ప్రతి ఇంటికి నీరు అందుతుందన్నారు పెద్దిరెడ్డి. కానీ చంద్రబాబు ఆ నిర్మాణాలను ఆపడానికి సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి స్టే తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తే, దానిని ఒకటిన్నర సంవత్సరం పాటు కోర్టులో అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో డిపాజిట్ లు కూడా రావన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా.. ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అని విమర్శిస్తున్నాయన్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి జరుగుతున్న వారికి అది కనపడదని విమర్శించారు పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news