BREAKING : ఏపీలో ఎమ్మార్వో దారుణ హత్య

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా కొమ్మాదిలో ఎమ్మార్వో రమణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి చొరబడి రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో వారు పారిపోయారు.

తీవ్రంగా గాయపడిన రమణయ్యను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిపి రవిశంకర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

కాగా, ఎమ్మార్వో రమణయ్య విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్, కలెక్టరేట్లో ఏవో గా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పనిచేశాడు రమణయ్య. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news