టిడిపి అధికారంలోకి వస్తే నానీలు దేశం విడిచి పారిపోతారు – దేవినేని ఉమ

-

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు నానీలు హైదరాబాదులో దాక్కున్నారని.. ఇప్పుడు మరోసారి టిడిపి అధికారంలోకి వస్తే ఈ నాణీలు దేశం విడిచి పారిపోతారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. దోచుకున్న డబ్బును కాపాడుకునేందుకే కొడాలి నాని, పేర్ని నానీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకే బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.

తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకే చింతకాయల విజయ్ పై కేసు పెట్టారని అన్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం నిజాయితీగా జీవిస్తుంది అన్నారు దేవినేని ఉమా. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని మండిపడ్డారు. సజ్జల మాటలు విన్న గౌతమ్ సవాంగ్, ఎల్ వి సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలన్నారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు తమకు కూడా సమయం వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news