నేరం ఒప్పుకో.. బాబాయ్ ని చంపిన పాపం ప్రక్షాళన చేసుకో – నారా లోకేష్

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇటీవల సిబిఐ విచారణ అనంతరం వైయస్ వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నేరాన్ని తమపై వేయాలని చూసారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

ys jagan on nara lokesh

” గొడ్డలి మీదే, వేటు వేసింది మీరే. మీ చేతులకు అంటిన రక్తం మరకలు మాకు అంటించాలని చూశావు. ఆధారాలు చెరిపేశావు. జనాల్ని నమ్మించేశాం అనుకున్నావు. గూగుల్ టేక్ అవుట్ కి దొరికేశావు. ఇంకెన్నాళ్లీ తప్పుడు రాతలు, దాగుడుమూతలు జగనాసుర. నేరం ఒప్పుకో.. బాబాయ్ ని చంపిన పాపం ప్రక్షాళన చేసుకో” అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news