జగనోరా వైరస్ కి టిడిపియే వ్యాక్సిన్ – లోకేష్

-

జగనోరా వైరస్ కి టిడిపియే వ్యాక్సిన్ అని నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి టౌన్ సీతానగరంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టిడిపియే వ్యాక్సిన్. వైసీపీ గూండాల బెదిరింపులకు తెలుగుదేశం నేతలు భయపడరు. జగన్ రెడ్డి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారని ఫైర్ అయ్యారు.

 

జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ. సీతానగరం ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చానన్నారు. ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా? ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా? అని ప్రశ్నించారు లోకేష్.

 

Read more RELATED
Recommended to you

Latest news