ఏపీలో విద్యార్థులకు అలర్ట్‌.. నేటి నుంచి విద్యార్థులకు ఫేస్‌ అటెండెన్స్‌ అమలు

-

ఏపీ ప్రభుత్వం ఇటీవల విద్యార్థుల అటెండెన్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ఉపాధ్యాయులకు మాత్రమే ఉండగా.. తాజాగా విద్యార్థులకు సైతం అమలు చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. నేటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ఫేస్‌ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలన్నీ వెంటనే దీన్ని అమలుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇంజనీరింగ్‌, ఫార్మా, బీఈడీ వంటి ఇతర ఉన్నత విద్య కోర్సులన్నిటికీ దశలవారీగా అమలుచేయనున్నారు అధికారులు. దీనికిగాను గత రెండు వారాలుగా డిగ్రీ కళాశాలల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఫేస్‌ అటెండెన్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపారు.

Facial Recognition Attendance: అటెండెన్స్ విషయంలో కీలక మార్పు.. ఫేషియల్  రికగ్నిషన్ ద్వారా.. - NTV Telugu

డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులతో పాటు విద్యార్థుల రిజిస్ర్టేషన్‌ను పూర్తిచేశారు. ఇటీవల కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు మినహా దాదాపు అందరినీ ఇందులోకి తీసుకొచ్చారు. విద్యార్థులను ముఖాలను పలు కోణాల్లో ఫొటో క్యాప్చర్‌ చేశారు. దీంతో తరగతి గదిలో ఈ యాప్‌ను ఉపయోగించి ఫొటో తీస్తే విద్యార్థుల ముఖాలను యాప్‌ గుర్తించి హాజరు నమోదు చేస్తుంది. గుర్తించని ముఖాలను ఎర్రర్‌గా చూపిస్తుంది. అలాంటి వారికి అధ్యాపకులు రెండోసారి రిజిస్ర్టేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయే ప్రక్రియ అని అధికారులు తెలిపారు. తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒకటి లేదా రెండు ఫొటోలతో హాజరు పడుతుందన్నారు. ఒకవేళ ఫొటో తీసే సమయానికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోయినా యాప్‌లో హాజరు నమోదు అవుతుందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news