సొంత పార్టీలోనే విప‌క్షంగా మారిన ఎంపీ.. టీడీపీలో చ‌ర్చ..‌!

-

ఆయ‌న రెండోసారి కూడా కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీగా విజ‌యం సాధించారు. పైగా.. త‌న‌క‌న్నా ధ‌న‌వంతుడు.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌డు.. అని ప్ర‌చారం జ‌రిగిన వైసీపీ నేత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌ను సైతం జ‌గ‌న్ సునామీలో ఓడించారు. అస‌లు గెలుస్తారా?  గెల‌వ‌రా? అనుకుంటూ.. తీవ్ర ఉత్కంఠ‌లో ఉన్న టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించారు. ఆయ‌నే విజ‌య‌వాడ‌కు చెందిన ఎంపీ కేశినేని నాని. తొలిసారి గెలిచి న‌ప్పుడు.. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. దూకుడుగా ప్ర‌వ‌ర్తించారు. ఏకంగా ఆర్టీయే కార్యాల‌యంపై దాడి చేయ‌డం.. క‌మిష‌న‌ర్ చొక్కా ప‌ట్టుకోవ‌డం వంటివి తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు రెండో సారి గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న త‌న దూకుడును సొంత‌పార్టీపైనే చూపుతున్నార‌నే వాదన పార్టీలో బ‌లంగా వినిపిస్తోంది. రెండోసారి గెలుపు గుర్రం ఎక్కిన త‌ర్వాత‌.. పార్టీలో ప్రాధాన్యం ఊహించ‌ని విధంగా త‌గ్గిపోయింది. నిజానికి కేశినేనికి ప్ర‌ధాన్యం ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్ర‌బాబు గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప‌రిణామంతో కేశినేని అల‌క పాన్పు ఎక్కారు. అయితే, దీనిపై చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌నే సాగింది. కేశినేనిని దువ్వేందుకు ప్ర‌య‌త్నాలు సాగాయి. కానీ, ఆయ‌న ఎక్క‌డా త‌న పంతాన్ని వీడ‌లేదు.

ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మాదిరిగానే గ‌తంలో టీడీపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేశారు. అయితే, ఈరేంజ్‌లో కాదులేండి. అయితే, గ‌తంలో కేశినేని కూడాపార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌నే ప్ర‌చారం ఉంది. ఇటీవ‌ల మ‌హానాడుకు విజ‌య‌వాడ‌కు చెందిన నాయ‌కులు పాల్గొన్నారు. కానీ, కేశినేని మాత్రం.. విజయ‌వాడ గ‌డ‌ప దాట‌లేదు. మ‌హానాడులో పాల్గొన్నా ముక్త‌స‌రిగా స‌రిపెట్టారు. ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత‌.. కేశినేని ఎవ‌రితోనూ మాట్లాడ‌డం మానేశారు. అంతేకాదు.. ఆయ‌న‌కు స్థానిక ఎమ్మెల్యేతోనూ.. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ ఇంచార్జ్‌తోనూ కూడా వివాదాలు న‌డుస్తున్నాయి. దీంతో విజ‌య‌వాడ వంటి కీల‌క న‌గ‌రంలో ఎంపీగా ఉన్న సొంత‌పార్టీలోనే ఆయ‌న‌ను ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news