తెలంగాణకు వెళ్తే ఆంధ్ర వాళ్లను దోచేశారు.. దొబ్బేయండని తిడుతున్నారు – పవన్‌ కళ్యాణ్‌

-

తెలంగాణకు వెళ్తే ఆంధ్ర వాళ్లను దోచేశారు.. దొబ్బేయండని తిడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండవ విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు లో సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నిన్న తాడెపల్లి గూడెంలో నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవని ఆగ్రహించారు. తెలంగాణకు వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారని నిప్పులు చెరిగారు పవన్‌ కళ్యాణ్‌. కృష్ణ సమయంలో అందరూ బాధలో ఉంటే మన సీఎం జగన్ మాత్రం .. అవునా మీ నాన్న గారు చనిపోయారా అంటూ నవ్వుతాడు అంటూ మాట్లాడారు పవన్. కొంచెం అయినా సీఎం కు సంస్కారం సెన్స్ ఉందా అంటూ ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news