నేటి నుంచి 4 రోజుల పాటు ఏపీలోనే పవన్‌ కళ్యాణ్‌ మకాం

-

నేటి నుంచి 4 రోజుల పాటు ఏపీలోనే పవన్‌ కళ్యాణ్‌ మకాం వేయనున్నారు. నేటి నుండి నాలుగు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారను . మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొననున్న పవన్… ఇవాళ పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం
మధ్యాహ్నం 2 గంటలకు బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.

రేపు ఉదయం 11గం.లకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష. పార్టీలో చేరికలు ఉండనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గం.లకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ కానున్నారు.13 వ తారీఖు ఉదయం 11గం.లకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష, సాయంత్రం 5 గం. లకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వక భేటీ, 14 వ తారీఖు మధ్యాహ్నం 1 గం.లకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వారాహి తో మచిలీపట్నం సభకు బయలుదేరనున్నారు. ఇక సాయంత్రం 5గం.లకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకునీ బహిరంగ సభలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Latest news